Pastor Praveen Death Mystery : వైన్ షాప్లో పాస్టర్ ప్రవీణ్.. !

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన  పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఆయనకు సంబంధించిన సంచలన సీసీ ఫుటేజ్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఓ వైన్ షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ కనిపించినట్లుగా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది.

author-image
By Krishna
New Update

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన  పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఆయనకు సంబంధించిన సంచలన సీసీ ఫుటేజ్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఓ వైన్ షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ కనిపించినట్లుగా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది.  కోదాడ, ఏలూరు మధ్యలోని ఓ వైన్ షాప్‌లో  ఆయన మద్యం కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ మద్యం సేవించి బైక్ నడిపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రమాదానికి ముందే ఆయన బైక్‌ హెడ్ లైట్ పగిలి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన  ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కేసుకు సంబంధించి మరో మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని ఏలూరుల ఐజీ అశోక్ కుమార్ చెబుతున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసును ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నారు.  సీఎం, డీజీపీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకుపైకి దూసుకెళ్లిన బొలెరో!

ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు.

New Update
ACCIDENT

AP Kakinada road accident one man died

Accident: ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు. ఈ మేరకు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొలెరో డ్రైవర్ మద్యం సేవించినట్లు అనుమానిస్తు్న్నారు. శివ అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా మృతిడి పేరెంట్స్, బంధువులు శోకచంద్రంలో మునిగితేలారు. 

ప్రేమోన్మాది కత్తితో దాడి..

ఇదిలా ఉంటే.. విశాఖలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ సంఘటన  విశాఖపట్నం జిల్లాలో బుధవారం కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం.. కొమ్మాది స్వయం కృషినగర్‌లో తల్లి, కుమార్తె  ఇద్దరు నివాసం ఉంటున్నారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని పక్క ప్లాన్‌తో వారి ఇంటికి కత్తితో వచ్చి దాడి చేశాడు. ఈ దాడి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.  

ఇది కూడా చదవండి: Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్!

ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాతాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయటంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు నింతుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!

 kakinada | died | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment