AP MLC Elections: రేసు నుంచి వర్మ ఔట్.. దేవినేని ఇన్.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే!

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా MLC స్థానాలకు నోటిఫికేషన్ విడుదలై విషయం తెలిసిందే. TDP నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా, మోపిదేవి వెంకటరమణ, బీద రవిచంద్ర, బుద్ధా వెంకన్న, మంతెన సత్యనారాయణ పోటీలో ఉన్నారు. పిఠాపురం వర్మకు ఛాన్స్ లేదని తెలుస్తోంది.

New Update
TDP MLC Candidates Final List

TDP MLC Candidates Final List

ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇందులో మొత్తం ఐదు స్థానాలు కూడా కూటమికే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో ఎవరికి అవకాశం ఎవరిని వరిస్తుందోననే చర్చ జోరుగా సాగుతోంది. జనసేన నుంచి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయం జరిగినట్లు కూటమి వర్గాల్లో చర్చ సాగుతోంది. మిగిలిన మూడు టీడీపీకి దక్కనున్నాయి. ఈ మూడు స్థానాల కోసం టీడీపీ నుంచి ఆరుగురు కీలక నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ లిస్ట్ లో దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, బీద రవీంద్ర, మోపిదేవి వెంకటరమణ, వంగవీటి రాధా, మంతెన సత్యనారాయణ ఉన్నారు.

దేవినేనికి పక్కా..

మైలవరం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి... మంత్రిగా కూడా పని చేసిన సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాలతో పోటీ నుంచి దూరంగా ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు టీడీపీ అక్కడ అవకాశం ఇచ్చింది. దీంతో దేవినేని ఉమాకు ఎమ్మెల్సీగా ఛాన్స్ పక్కా అన్న ప్రచారం సాగుతోంది. గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన బుద్ధా వెంకన్న గత ఐదేళ్లలో వైసీపీ సర్కార్ పై తీవ్రంగా పోరాటం చేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినా.. ఆయనకు ఛాన్స్ దక్కలేదు. దీంతో తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఆయన హైకమాండ్ ను కోరుతున్నట్లు తెలుస్తోంది. 

మరో సీనియర్ నేత బీద రవీంద్ర పేరును బీసీ కోటాలో చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్న మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీగా అవకాశం రావడం ఖాయమన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో సాగుతోంది. వైసీపీని వీడే సమయంలో రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన వదులుకున్నారు. అందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

రేసులో రాధా?

వంగవీటి రాధాకు కూడా ఎమ్మెల్సీ పదవి దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారం సాగుతోంది. కాపు సామాజిక వర్గంలో కీలక నేత.. బలమైన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న రాధా.. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కూటమి విజయం కోసం పని చేశారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలన్న చర్చ టీడీపీలో సాగుతున్నట్లు తెలుస్తోంది. మంతెన సత్యనారాయణ రాజు కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. 

అయితే.. పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఈ సారి కూడా నిరాశే మిగిలే అవకాశం ఉంది. సమీకరణాల దృష్ట్యా ఆయన పేరును టీడీపీ హైకమాండ్ ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలు, లేదా గవర్నర్ కోటాలో వర్మకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

New Update
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanam

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గం. వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. 9గం. నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని, పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!


ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం :


ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం :


ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌సంతోత్సవం, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 10 నుండి 12 వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు