AP: వామ్మో.. పాతిక కిలోల బంగారం ధరించిన గోల్డ్మాన్లు..! నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ముగ్గురు భక్తులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. పూణేకు చెందిన వీరు మెడలో తాళ్ల సైజులో ఉన్న గొలుసులు, చేతికి పెద్ద పెద్ద కడియాలు, భారీ సైజ్ ఉంగరాలు ధరించడంతో భక్తులు ఆసక్తిగా పరిశీలించారు. By Jyoshna Sappogula 23 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Tirumala: మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివిధ రకాల బంగారు అభరణాలు ధరిస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. అయితే, నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ముగ్గురు భక్తులు వారు ధరించిన బంగారు అభరణాలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. పూణేకు చెందిన వీరు మెడలో తాళ్ల సైజులో ఉన్న గొలుసులు, చేతికి పెద్ద పెద్ద కడియాలు, భారీ సైజ్ ఉంగరాలు ధరించడంతో భక్తులు ఆసక్తిగా పరిశీలించారు. దాదాపు పాతిక కిలోల బంగారాన్ని వీరు ధరించినట్లు తెలుస్తోంది. Also Read: బీభత్సం సృష్టించిన యూట్యూబర్.. షాకిచ్చిన పోలీసులు..! ముగ్గురి ఒంటిపై ఏకంగా భారీ స్థాయిలో బంగారు అభరణాలు ధరించడం చూసి అక్కడి శ్రీవారి భక్తులు అవాక్కయ్యారు. పుణెకు చెందిన గోల్డెమాన్లు సన్నీ నన వాగ్చోరీ, సంజయ్ దత్తత్రయ గుజర్.. దాదాపు పాతిక కిలోల బంగారాన్ని ధరించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అక్కడి భక్తులు ఎగబడ్డారు. ఈ గోల్డ్ మాన్ ఫ్యామిలీ చేసిన హంగామా అంతా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also Read: ఫార్మా బాధితులను పరామర్శించిన జగన్.. మా హయాంలోనే ఎక్కువ ప్రమాదాలు అంటూ.. #tirumala సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి