AP: ఒరేయ్ గే.. లఫూట్ నాయాలా : విజయసాయిరెడ్డిపై రెచ్చిపోయిన టీడీపీ నేత!

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. డీఎన్ఏ టెస్టుకు విజయసాయి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. అలాగే మదన్ మోహన్ కు రూ.1.60 కోట్లు ఎందుకు ఇచ్చాడో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

New Update
AP: ఒరేయ్ గే.. లఫూట్ నాయాలా : విజయసాయిరెడ్డిపై రెచ్చిపోయిన టీడీపీ నేత!

TDP Anam Venkataramana Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న శాంతి బిడ్డకు తండ్రి ఎవరనే ఇష్యూపై టీడీపీ నేత ఆనం వెంకటరమణ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంపై సెన్షేషనల్ కామెంట్స్ చేశారు.

మధన్ మోహన్ తన బిడ్డకి తండ్రి ఎవరని అడిగారని.. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదని అన్నారు. బిడ్డకి విజయసాయి తండ్రి అని మధన్ చెప్పాడని అన్నారు. అయితే, విజయసాయికి అంత సీను లేదని..కుమార్తెని దత్తతు తీసుకుని పెంచుతున్నాడని వ్యాఖ్యానించారు. విజయసాయి పూజకి పనికిరాని పువ్వా?... పనికొచ్చే పువ్వా?...అనేది డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలన్నారు.

Also Read: ఖమ్మంలో అమానుషం.. ఆలనాపాలనా చూసుకుంటున్న అమ్మమ్మపై మనవడు అఘాయిత్యం!

సుదర్శన్ రెడ్డి డీఎన్ఏకి రెడీ అన్నాడు.. మరి నువ్వెందుకు డీఎన్ఏకి రావడం‌ లేదని ఆనం విజయసాయిని ప్రశ్నించారు. డీఎన్ఏ టెస్టుకు విజయసాయి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. డీఎన్ఏ టెస్టులో ఏమీ లేకపోతే మంచిదే కదా అంటూ వ్యాఖ్యానించారు. 'నువ్వు చేసిన వెధవ పనికి వీకే డీఎన్ఏ టెస్టు చేసుకోవాలా?... లఫూట్ నాయాలా?... మర్డర్లు చేసి జైళ్లకి పోయిన కుటుంబం రా.. మీది' అంటూ తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు.

నిన్న శాంతి భర్త మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలను ఆనం ప్రస్తావించారు. ఒక పార్లమెంటు సభ్యుడు తనకు రూ.1.60 కోట్లు ఇచ్చాడని ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చెబుతున్నాడని.. విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రెండు లాఠీ దెబ్బలు తగిలిస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు