Allagadda: పోటీ నుంచి తప్పుకుంటా.. ఎమ్మెల్యే అభ్యర్థి షాకింగ్ కామెంట్స్

వాలంటీర్ల వ్యవస్థతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బిజెంద్రారెడ్డి మండిపడ్డారు. తాను కమిషన్లు తీసుకున్నానని భూమా అఖిలప్రియ చేసిన ఆరోపణలు ఒక్కటి నిరూపించినా.. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

New Update
Allagadda: పోటీ నుంచి తప్పుకుంటా.. ఎమ్మెల్యే అభ్యర్థి షాకింగ్ కామెంట్స్

YCP MLA Candidate Gangula Bijendra Reddy: ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బిజెంద్రారెడ్డి RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థతో రాజకీయం చేస్తుంది చంద్రబాబని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు సకాలంలో అందించకుండా అడ్డుకుంది టీడీపీననే ధ్వజమెత్తారు.

Also Read: వైఎస్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే? సంచలన విషయాలు బయటపెట్టిన సునీత!

ఒకప్పుడు వాలంటీర్ల వ్యవస్థ వల్లే ఉమెన్ ట్రాఫిక్ జరుగుతుందని ఆరోపించారన్నారు. అనర్ధాలు జరుగుతున్నాయని చెప్పిన వాళ్లే నేడు దాన్ని మెరుగుపరుస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిల ప్రియ చెప్పే ప్రతి చెత్త మాటలకు సమాధానం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు.

Also Read: ఉండి టీడీపీలో బిగ్‌ట్విస్ట్‌.. సీటు మార్చడంతో రామరాజు వర్గం ఆందోళన

వర్షాభావ పరిస్థితులతో రైతాంగానికి కాలువ నీళ్లు అందించలేకపోయింది వాస్తవమని.. కానీ, కమిషన్లు తీసుకున్నారని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని వివరించారు. తనపై అఖిలప్రియ చేస్తున్న ఆరోపణలు ఒక్కటి నిరూపించినా.. వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు ఓట్లు వేయరని పేర్కొన్నారు. కేవలం మీడియా అటెన్షన్ కోసమే అఖిలప్రియ మాపై తప్పుడు ఆరోపణ చేస్తోన్నారని కామెంట్స్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు