Prudhvi Raj: మంత్రి రోజాకు, అంబటి రాంబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పృథ్వీరాజ్.!

టీడీపీ- జనసేన కూటమికి 136 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాలు రావడం ఖాయమన్నారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్. డైమండ్ రాని గురించి మాట్లాడి వేస్ట్ అంటూ రోజాపై సెటైర్లు వేశారు. పోలవరం గేట్ల గురించి కూడా తెలియని మంత్రి అంబటి.. పోలవరం గురించి మాట్లాడటం దౌర్భాగ్యమని ఎద్దేవ చేశారు.

New Update
Prudhvi Raj:  మంత్రి రోజాకు, అంబటి రాంబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పృథ్వీరాజ్.!

Actor Prudhvi Raj: టీడీపీ- జనసేన కూటమికి 136 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాలు రావడం ఖాయమని థీమా వ్యక్తం చేశారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికే టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చిందన్నారు. ఏపీలోని శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఎన్నికల సర్వే చేశానని..అందులో వైసీపీ ఓడిపోతుందని తేలిందన్నారు.

Also Read: పుట్టపర్తి వైసీపీలో రౌడీ రాజకీయాలు.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వర్సెస్ లోచర్ల విజయభాస్కర్ రెడ్డి..!

ఈ క్రమంలో మంత్రి రోజాపై సెటైర్లు వేశారు. డైమండ్ రాని గురించి మాట్లాడి టైం వేస్ట్ అన్నారు. ఆమెకు టిక్కెట్టు లేదని..ఇచ్చినా కూడా ఓటమి తప్పదని కామెంట్స్ చేశారు. జనసేన, టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక రోజా అక్రమాలపై విచారణ ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంత్రి అంబటి రాంబాబు డిస్ట్రిబ్యూటర్ గా పనికొస్తాడని కౌంటర్లు వేశారు. పోలవరం గేట్ల గురించి కూడా తెలియని ఆయన పోలవరం గురించి మాట్లాడటం దౌర్భాగ్యం అని చెప్పుకొచ్చారు.

Also Read: గోదావరి జిల్లాలో మంత్రముగ్ధులను చేస్తున్న మంచు అందాలు.!

ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఒక విగ్రహం, లడ్డు తీసుకుంటారు.. అమిత్ షాకు ఇస్తారు తప్ప.. రాష్ట్రానికి చేసింది ఏమీలేదని కామెంట్స్ చేశారు. చెల్లికి, తల్లికి న్యాయం చెయలెనోడు రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. నా బీసీ, మైనార్టీ, ఎస్సీలు అంటారు.. వాళ్ళకున్న 26 పథకాలు తీసేశారని పేర్కొన్నారు. అంబేద్కర్ విద్యా దీవెనను జగనన్న విద్యగా మార్చుకున్నాడని.. పేర్లు మార్చడం తప్ప రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు