Gang Rape In AP: ఏపీలో దారుణం.. భర్తను కొట్టి భార్యపై గ్యాంగ్ రేప్!

AP: ఏలూరు జిల్లా రామకోటి ప్రాంతంలో వివాహితపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపింది. భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి అతను నిద్రలోకి జారుకున్నాక అతని భార్యపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు.

New Update
Crime : పండగపూట దారుణం.. ఏపీలో బాలికపై గ్యాంగ్ రేప్

Gang Rape In AP:  ఏపీలోని ఏలూరు జిల్లాలో భర్త ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారం జరగడం సంచలనంగా మారింది. ఏలూరు వన్ టౌన్ వన్ టౌన్ రామకోటి ప్రాంతంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పెదవేగి మండలం విజయరాయికి చెందిన వ్యక్తి అతని రెండో భార్యతో కలసి ఏలూరు రామకోటి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. నగరంలో పలు హోటళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తాము కూడా పనికి వస్తామని దంపతులను నగరానికి చెందిన ముగ్గురు యువకులు పరిచయం చేసుకున్నారు.

గత శుక్రవారం రాత్రి ముగ్గురు యువకులతో కలసి భర్త మద్యం సేవించాడు. భర్త కు ఫుల్ గా మద్యం పట్టించి మత్తు ఎక్కాక భర్తపై విచక్షణా రహితంగా దాడి చేశారు యువకులు. ఆపై భార్యను బెదిరించి ఆమె పై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కొద్దిసేపటి తర్వాత గాయాలతో రోడ్ పైకి వచ్చి స్థానికులను భర్త సాయం కోరాడు. 100 కు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. శనివారం సాయంత్రంలోపు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు చెంచుల కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేటకు చెందిన నారపాటి నాగేంద్ర, గడ్డి విజయ్ కుమార్ అలియాస్ నానిగా గుర్తించారు.

Also Read : ముగిసిన ఢిల్లీ పర్యటన.. నేడు ఏపీకి సీఎం చంద్రబాబు

Advertisment
Advertisment
తాజా కథనాలు