AP Tourism: ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భారీ స్కామ్.. ఏకంగా కోట్లు మింగేశారుగా!

ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో చిక్కుకుంది. కార్పొరేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న దిండి రిసార్ట్స్‌లో రూ.1,16,36,260 అవకతవకలు జరిగినట్లు నిర్ధారించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఈ రిసార్ట్ ఉంది. రిసార్ట్‌ రిసెప్షనిస్ట్ సత్యనారాయణ పరారీలో ఉన్నారు.

New Update
AP Tourism: ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భారీ స్కామ్.. ఏకంగా కోట్లు మింగేశారుగా!

AP Tourism Development Corporation: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దిండి రిసార్ట్స్ లో భారీ స్కాం జరిగినట్లు తెలుస్తోంది. టూరిజం శాఖ ఉన్నతాధికారులు మలికిపురం పోలీస్ స్టేషన్ లో మేనేజర్ పణింద్ర సహా మరో నాలుగురు ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజోలు సీఐ గోవిందరాజు.

Also Read: బాలీవుడ్ ఖాన్స్ తో రామ్ చరణ్ నాటు..నాటు స్టెప్స్..అంబానీ వేడుకల్లో మాస్ రచ్చ!

రిసెప్షన్ గా పనిచేస్తున్న సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2021 సంవత్సరం నుంచి దిండి రిసార్ట్స్ కి చెందిన నగదు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 2021 నుంచి దిండి రిసార్ట్స్ కు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా విజిలెన్స్ అధికారులు పరిశీలించి రూ.1,16,36,260 అవకతవకలు జరిగినట్లు నిర్ధారించారు.

Alos Read: లంచం కేసుల్లో ఎంపీలు,ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు

దిండి రిసార్ట్స్ మేనేజర్ పణింద్ర, అకౌంటెంట్, ఇద్దరు రిసెప్షలిస్టులు, బార్ నిర్వాహకుడు పాత్రపై సీఐ గోవిందరాజు దర్యాప్తు చేపట్టారు. రిసెప్షనిస్ట్ సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారీ స్కాంలో అతనే కీలకపాత్ర వహించినట్లు అనుమానాలు కలుగుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

గడచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని కల్లారా చూసామని, ఆ విధ్వంసం నుంచి కోలు కోవడానికి చాలా కష్టపడాలి. జగన్ పార్టీ నేరాలు హత్యలు అవినీతి అరాచకం అణచివేత మీద నిర్మించ బడిందని ఏపీ మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
AB Venkateswara Rao

AB Venkateswara Rao

AB Venkateswara Rao :గడచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని కల్లారా చూసామని, ఆ విధ్వంసం నుంచి కోలు కోవడానికి చాలా కష్టపడాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీ నేరాలు హత్యలు అవినీతి అరాచకం అణచివేత కులాల మీద నిర్మించ బడిందని ఏపీ మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రానికి ,ఆంధ్ర సమాజానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం..పెద్ద ఉపద్రవం వైయస్ జగన్, ఆయన  వైయస్సార్ పార్టీ అన్నారు. సమాజానికి పెద్ద ప్రమాదం వైఎస్ జగన్ అని, ఆయన పాలనలో వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి, ప్రజాస్వామ్య విలువలు విధ్వంసం అయ్యాయన్నారు.

Also read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

 రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నా వంతు నేను పని చేస్తానని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాకు వద్దు అని ప్రజలు నిశ్చయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు..బలహీనులు,బాధితులకి సాయం చేయడం కోసం వాళ్లకి అండగా ఉండడం కోసం అలాగే అన్యాయాలు జరిగితే ఎదురు నిలవడం కోసం తప్పులు సరిదిద్దడానికి ప్రజల ఆలోచనలను నాకు జ్ఞానం ఉన్నంతవరకు అవగాహన చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని స్పష్టం చేశారు.

  Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్


నా దృష్టిలో రాజకీయాలంటే సమాజ స్థితిగతుల్ని అవగాహన చేసుకుని జరిగినటువంటి తప్పులను సవరించుకొని తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడుతూ ఒక మెరుగైన భవిష్యత్తు కోసం సమాజాన్ని నడిపించడంలో చురుకైన పాత్ర పోషించడమే అన్నారు.రాజకీయాలంటే పదవి, అధికారము రాజకీయం కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో రాజకీయాలంటే అరాచకం అడ్డొచ్చిన వాళ్ళని అణిచివేయడం అని వెల్లడించారు.ప్రజల్ని కులాలు ,మతాలు, ప్రాంతాలు వర్గాలుగా విడదీసి ఒకళ్ళ మీద ఒకరు ఎగదోసి ఆ సందర్భంలో తన దోపిడీని  కొనసాగించుకోవచ్చని మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని త్వరలో రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

Advertisment
Advertisment
Advertisment