Crime News: కొడుకు మృత‌దేహంతో 8 కిలోమీట‌ర్లు నడిచి వెళ్లిన కన్నతండ్రి..!

అల్లూరి జిల్లా అనంత‌గిరి మండలంలో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. చిన‌కోనెల‌కు చెందిన సార కొత్తయ్య చిన్న కుమారుడు ఈశ్వర‌రావు (3) అనారో గ్యంతో మృతి చెందాడు. గ్రామానికి స‌రైన‌ రోడ్డు సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో కొడుకు మృత‌దేహంతో తండ్రి ఏకంగా 8 కిలోమీట‌ర్లు న‌డిచాడు.

New Update
Crime News: కొడుకు మృత‌దేహంతో 8 కిలోమీట‌ర్లు నడిచి వెళ్లిన కన్నతండ్రి..!

Crime News:  అల్లూరి సీతారామ‌రాజు జిల్లా అనంత‌గిరి మండలంలో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. స‌రైన‌ రోడ్డు సౌక‌ర్యం లేక‌పో వ‌డంతో కొడుకు మృత‌దే హంతో తండ్రి ఏకంగా 8 కిలోమీట‌ర్లు న‌డిచాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. అనంత‌గిరి మండల ప‌రిధిలోని రొంప‌ల్లి పంచాయ‌తీ చిన‌కోనెల‌కు చెందిన సార కొత్త‌య్య కుటుంబంతో క‌లిసి గుంటూరు జిల్లా కొల్లూరు వ‌ద్ద ఇటుక‌ల బ‌ట్టీలో ప‌ని చేస్తున్నాడు.

Also Read: ఏపీకి ఆమె లేడీ విలన్.. బతుకంతా దానికోసమే: పోసాని కాంట్రవర్సీ కామెంట్స్!

ఈ క్ర‌మంలో ఆయ‌న చిన్న కుమారుడు ఈశ్వ‌ర‌రావు (3) సోమ‌వారం అనారో గ్యంతో చ‌నిపోయాడు. దాంతో మృత‌దేహాన్ని అంబులెన్స్‌లో స్వ‌గ్రామానికి త‌ర‌లించే ఏర్పాటు చేసుకున్నారు. అయితే, అంబులెన్స్ డ్రైవ‌ర్ వారిని  విజ‌య‌న‌గ‌రం జిల్లా మెంటాడ మండ‌లం వ‌నిజ వ‌ద్ద దించేసి వెళ్లిపోయాడు. ఇక అక్క‌డి నుంచి గ్రామానికి స‌రైన ర‌హ‌దారి లేక‌పోవ‌డంతో మృత‌దేహాన్ని మోసుకుని కాలిన‌డ‌క‌న వెళ్లాల్సిన ప‌రిస్థితి దాపురించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు