AP: ఏలూరు జిల్లాలో అమానుషం.. ఏడేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం..!

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అమానుషం చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై మడకం వెంకటేష్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఘటనపై స్పందించిన కలెక్టర్.. ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి నేరం రుజువైతే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

New Update
AP: ఏలూరు జిల్లాలో అమానుషం.. ఏడేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం..!

Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అమానుషం చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై మడకం వెంకటేష్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. నిన్న సాయంత్రం బాలికకు మాయ మాటలు చెప్పి పాడుబడ్డ దుకాణం వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఇంటికి వచ్చిన బాలిక ఒంటిపై రక్తపు మరకలు చూసి కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. బాలికను తీసుకెళ్లిన వెంకటేష్ ను నిలదీయడంతో అత్యాచారం చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఘటన నిన్న జరిగిన ఈ రోజు ఉదయం వరకూ పోలీసులు కేసు నమోదు చేయలేదు. స్థానిక వైసీపీ నేతలు కలుగజేసుకొని తప్పుడు రిపోర్ట్ తయారు చేయించారని ప్రచారం జరిగింది.

బాలికను ప్రాథమిక చికిత్స కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి తరలించారు. కలెక్టర్ కు సమాచారం అందటంతో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి హుటాహుటిన వెళ్లారు. అయితే, ఆసుపత్రిలో సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ సీరియస్ అయిన నేపథ్యంలో కుక్కునూరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  దీనిపై పూర్తి దర్యాప్తు చేసి నేరం రుజువైతే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు