/rtv/media/media_files/2025/02/06/DuZsqGFcyWPTUTeGmqtK.jpg)
TDP Tweet Over YCP Office Fire Accident
తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ (YS Jagan) నివాసం సమీపంలో నిన్న రెండు సార్లు అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగిన విషయం తెలిసిందే. సాయంత్రం ఒక సారి, రాత్రి 9 గంటల ప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. గార్డెన్ వద్ద ఎండిపోయిన మొక్కలకు మంటలు అంటుకున్నాయి. అయితే.. ఈ మంటలు ఎంలా అంటుకున్నాయనే విషయంపై వైసీపీ అనుమానం వ్యక్తం చేసింది. జగన్ భద్రతపై సైతం ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతాలోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని వైసీపీ ఆరోపించింది.
Also Read : TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!
వైయస్ జగన్ గారి ఇంటి వద్ద అగ్నిప్రమాదం. సాయంత్రం మరియు రాత్రి మంటలు ఎగసిపడ్డాయి.@ysjagan గారి భద్రతపై ప్రజలు, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/tst2y6stCq
— YSR Congress Party (@YSRCParty) February 5, 2025
Also Read : తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం
లిక్కర్ స్కామ్ పత్రాలకు నిప్పు?
అయితే.. ఈ అంశానికి సంబంధించి టీడీపీ (TDP) సంచలన ట్వీట్ చేసింది. లిక్కర్ అమ్మకాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నేపథ్యంలోనే ఈ మంటలు అంటూ అనుమానం వ్యక్తం చేసింది. సిట్టు పడింది - తగలబడిందంటూ సెటైర్లు వేసింది. ఈ మేరకు టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
సిట్టు పడింది - తగలబడింది..
— Telugu Desam Party (@JaiTDP) February 6, 2025
ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది.
* ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి ?
* సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా ?
* నిన్న… pic.twitter.com/4C0vGqqFDu
Also Read : కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి?.. సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా?.. నిన్న సాయంత్రం జరిగితే, ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సిసి ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు? అంటూ ప్రశ్నలు గుప్పించింది టీడీపీ. తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయటమే, 2.0 నా? అంటూ విమర్శలు చేసింది. ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, నీ అవినీతిని బయటకు తీస్తుంది.. గెట్ రెడీ.. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్.. అంటూ హెచ్చరించింది.
Also Read : వివేక్ కుట్రతో మాదిగలకు మళ్లీ అన్యాయం.. వర్గీకరణ ఇలా చేస్తారా?: మందకృష్ణ సంచలన ప్రెస్ మీట్!