/rtv/media/media_files/2025/01/25/TUe6Az3ofSgunrV4QWUG.jpg)
telugu padma awards Photograph: (telugu padma awards)
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డ్స్ 2025ను జనవరి 25 (శనివారం) ప్రకటించింది. 113 పద్మశ్రీ, 19 పద్మ భూషణ్, 7 పద్మవిభూషణ్ మొత్తం 139 అవార్డులు అందుకోనున్న వారి వివరాలు వెల్లడించారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ఉన్నారు. వివిధ రంగాల్లో కృషి చేసినందుకు గానూ ఈ అవార్డులతో వారిని కేంద్ర ప్రభుత్వం గౌరవించనుంది. మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురికి పద్మ అవార్స్ ప్రకటించారు.
Read also : పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.
వైద్యంలో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, కళారంగంలో నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కేఎల్ కృష్ణ (విద్యా, సాహిత్యం), మాడుగుల నాగఫణి శర్మ(కళా రంగం), మిరియాల అప్పారావు (కళారంగం), వి.రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య)లకు పద్మశ్రీ అవార్డులతో సత్కరించనుంది. తెలంగాణ నుంచి మంద కృష్ణ మాదిగ (సామాజిక సేవ) పద్మశ్రీ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Also Read: భారతీయులను కాపాడిన పాకిస్థాన్ అధికారికి పౌర పురస్కారం.. ఎందుకంటే ?