TS: పద్మ పురస్కార గ్రహీతలకు తెలంగాణ సీఎం రేవంత్ అభినందనలు

పద్మ పురస్కారాలు లభించిన తెలుగు వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వరుసపెట్టి అందరూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాలకృష్ణో పాటూ మిగతా అదరికీ శుభాభినందనలు తెలిపారు.

New Update
CM Revanth Reedy

CM Revanth Reedy

ప‌ద్మ విభూష‌ణ్, ప‌ద్మ భూష‌ణ్‌, ప‌ద్మ శ్రీ పుర‌స్కారాల‌కు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల నుంచి  ఎంపికైన ప్ర‌ముఖుల‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. వైద్య‌రంగంలో విశేష సేవ‌లు అందించిన డాక్ట‌ర్ డి. నాగేశ్వ‌ర్‌రెడ్డికి ప‌ద్మ‌విభూష‌ణ్‌, సినిమా రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ప‌ద్మ భూష‌ణ్‌, ప్ర‌జా వ్య‌వ‌హారాల విభాగంలో మంద కృష్ణ మాదిగ‌కు, క‌ళలు, సాహిత్యం, విద్యా విభాగాల్లో  కే.ఎల్.కృష్ణ‌, మాడుగుల నాగ‌ఫ‌ణిశ‌ర్మ‌, దివంగ‌త మిర్యాల అప్పారావు, రాఘ‌వేంద్రాచార్య పంచ‌ముఖిల‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాలు ద‌క్క‌డంపై ముఖ్య‌మంత్రి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తాము ఎంచుకున్న రంగంలో వారు చేసిన కృషి.. అంకిత‌భావమే వారిని దేశంలోని ఉన్న‌త పుర‌స్కారాల‌కు ఎంపిక‌య్యేందుకు కార‌ణ‌మ‌య్యాయ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

Also Read: JR NTR- Balakrishna: కంగ్రాట్స్ బాల బాబాయ్.. జూ.ఎన్టీఆర్ సంచలన ట్వీట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు