Iranian media : ఆమె బతికే ఉంది..ఇరాన్ మీడియా సంచలన ప్రకటన!
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన చేసింది. దివంగత ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే బతికే ఉన్నారని చెప్పంది. ఆమె చనిపోయినట్లుగా వస్తున్న వార్తలను ఖండించింది.
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన చేసింది. దివంగత ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే బతికే ఉన్నారని చెప్పంది. ఆమె చనిపోయినట్లుగా వస్తున్న వార్తలను ఖండించింది.
హర్మూజ్ జలసంధి శత్రుదేశాల నౌకలకు మృత్యుమార్గంగా మారింది. ఇరాన్ తన పటిష్టమైన 'సీమైన్స్'తో అమెరికా, దాని మిత్రదేశాల నౌకలను టార్గెట్గా చేసుకుంటోంది. సముద్ర గర్భంలో ఇరాన్ అమర్చిన మందుపాతరలు ఇప్పుడు ట్రంప్ సర్కార్పై కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇజ్రాయెల్ 1948లో దేశంగా ఏర్పడినప్పటి నుండి తన ఉనికి కోసం, భూభాగాల కోసం అనేక దేశాలతో, ముఖ్యంగా అరబ్ దేశాలతో నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ 22,145 చ.కి.మీలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఇజ్రాయిల్ దేశం కంటే దాదాపు 5 రెట్లు పెద్దది.
యుద్ధంలో అమెరికా సైన్యానికి మరో గట్టి దెబ్బ ఎదురైంది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఇంధనాన్ని నింపే KC-135 స్ట్రాటోట్యాంకర్ విమానం కూలిపోయింది. గాలిలో ఉన్న ఇతర యుద్ధ విమానాలకు ఇంధనం నింపే ఈ భారీ విమానం కుప్పకూలడం అమెరికా రక్షణ రంగానికి పెద్ద నష్టమే.
2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్గా ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ఇరాన్ను కోలుకోలేని దెబ్బ తీస్తుందని వాషింగ్టన్ భావించింది. కానీ, గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తున్నాయి.
ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇరాన్ను పాలించిన ఆయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ(56) దేశపు మూడవ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ తన తొలి ప్రసంగంతోనే ప్రపంచ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అమెరికాను లక్ష్యంగా చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉత్సాహాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి.
మిడిల్ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. లగ్జరీ లైఫ్కు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న దుబాయ్కు కష్టకాలం ఎదురవుతోంది. అక్కడి నుంచి సంపన్నులు భారీగా వలస వెళ్లిపోతున్నారు.
పెన్సిల్వేనియాకు చెందిన భారత సంతతి సోదరులు భాస్కర్ సవాని, అరుణ్ సవాని భారీ మోసాలకు పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. దాదాపు పదేళ్ల పాటు సాగించిన ఈ విదేశీ వీసా మోసాలు, హెల్త్కేర్ కుంభకోణాలు, మనీ లాండరింగ్ వంటి నేరాల్లో వీరిద్దరూ దోషులుగా తేలారు.