Trump-Panama: పనామా పై ట్రంప్‌ పంతమే నెగ్గింది..ఇక అమెరికాకు ఉచితం!

పనామా కెనాల్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొంతమేరకు పంతం నెగ్గించుకున్నారు.తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్‌ నుంచి ప్రయాణించినప్పుడు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పనామా దేశం అంగీకరం తెలిపిందని అమెరికా రక్షణ మంత్రి హెగ్సే చెప్పారు.

New Update
trumppanama

trumppanama

Trump-Panama:పనామా కెనాల్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొంతమేరకు పంతం నెగ్గించుకున్నారు. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్‌ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్‌ అలెక్స్‌ కు మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్‌ నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరం తెలిపిందని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సే వెల్లడించారు.తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా ప్రభుత్వ నౌకలకు దీని నుంచి భారీ మొత్తంలో నగదు మిగులుతుందని పేర్కొన్నారు.

Also Read: Jeeth adani:పెళ్లి వేళ దివ్యాంగులకు జీత్ అదానీ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ ఎన్నిలక్షలసాయం అందించారంటే!

అదే సమయంలో అక్రమ వలసదారుల పై ఆ దేశం తీవ్ర స్థాయిలో విరుచుపడుతోందని మెచ్చుకొన్నారు. ఈ ఒప్పందం విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ కూడా ధ్రువీకరించింది. అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్‌ నుంచి ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చని ఎక్స్‌ లో చేసిన పోస్టులో పేర్కొంది.వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకుంది.

Also Read: indrajit sinha : శ్మశానవాటికలో బీజేపీ లీడర్.. బిచ్చం ఎత్తుకునే వరకు తీసుకొచ్చిన రాజకీయాలు

కాల్వను తిరిగి స్వాధీనం..

ఈవిషయాన్ని ఆదివారమే విదేశాంగ మంత్రి రూబియో సూచాయగా వెల్లడించారు. నవంబర్‌ లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నాటినుంచి ట్రంప్‌ పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకొంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

దీంతో ఒక్కసారిగా ఆ చిన్నదేశంలో ఆందోళన మొదలైంది.అమెరికాకు చెందిన 40 శాతం కంటైనర్లు పనామా నుంచి ప్రయాణిస్తాయి. ఇక్కడ చైనాకు చెందిన సంస్థలు ఇక్కడి ఓడరేవుల్లోనే పెట్టుబడి పెట్టడాన్ని ట్రంప్‌ తో సహా ఆయన విదేశాంగ మంత్రి రూబియో కూడా తప్పుపట్టారు.ఈ ఒత్తిడి తట్టుకోలేక తాము చైనాకు చెందిన బీఆర్‌ఐ ప్రాజెక్టులోని కాంట్రాక్టులు పునరుద్ధరించుకోమని పనామా అధ్యక్షుడు జాస్‌ రౌల్‌ మోలినో హామీ ఇచ్చారు.

ట్రంప్‌ ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నా..ఆ దేశం కొన్నింటికిఅంగీకరించడంతో కొంత మెత్తబడ్డారు.నౌకాయాన భారం తగ్గిస్తూ..అట్లాంటిక్‌-పసిఫిక్‌ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయప్రయాసలతో పనామా కాల్వను 1914లో నిర్మించింది. దీనిని తొలుత అమెరికానే  నిర్వహించింది. కానీ పనామా దేశంలో దీని పై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగడంతో 1977 లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ  కాల్వను ఆ దేశానికి అప్పజెబుతూ ఒప్పందం చేసుకొన్నారు. ఈ కాల్వ తటస్థంగా ఉండి తీరాలని అమెరికా షరతు పెట్టింది. ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకొనే హక్కుఉంటుందని పేర్కొంది.ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాల్వ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది. 

Also Read:గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు!

Also Read: ఛీ ఛీ.. టీచర్లు కాదు కామాంధులు.. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు కలిసి..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు