/rtv/media/media_files/2026/03/14/kharg-island-2026-03-14-11-16-49.jpg)
US bombs Iran's Kharg Island, most powerful raid in Middle East history, Says Trump
పశ్చిమాసియా(west-asia) లో గత రెండు వారాలుగా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు(iran us war) చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై, దాడులు చేస్తోంది. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ఆర్థిక సంపదపై అమెరికా దెబ్బకొట్టింది. ఆ దేశ చమురుకు కీలకంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్పై అమెరికా బలగాలు భీకర దాడులు చేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్లో వెల్లడించారు.
Also Read: మొజ్తాబా ఎక్కడున్నాడో చెపితే రూ.92 కోట్లు ఇస్తాం.. అమెరికా సంచలన ఆఫర్
అమెరికా(america) సెంట్రల్ కమాండ్ తాను ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దాడులు చేసిందని తెలిపారు. ఈ ఐలాండ్లో ఇరాన్ సైనిక కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు. పశ్చిమాసియాలో జరిగిన అత్యంత భీకర దాడుల్లో ఇదొకటిని తెలిపారు. ఇక్కడ చమురు మౌలిక సదుపాయలపై మాత్రం దాడులు చేయలేదన్నారు. ఒకవేళ హర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకలను అడ్డుకుంటే వాళ్ల చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.
అమెరికా వద్ద అత్యంత శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థలు ఉన్నాయన్నారు. తాము టార్గెట్ చేసే వాటిని ఇరాన్కు కాపాడుకునే సామర్థ్యం లేదన్నారు. ఆ దేశంలో అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్తో పాటు వాళ్లతో సంబంధాలు ఉన్నవాళ్లు వెంటనే ఆయుధాలు వదిలేయాలన్నారు. ఇరాన్లో మిగిలిపోయిన ప్రాంతాలను రక్షించుకోవడం తెలివైన పనని తెలిపారు. అయితే ఖర్గ్ ఐలాండ్పై దాడులు జరగడంపై ఇరాన్ ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు. ట్రంప్ ఆఖరి అస్త్రం ఇదేనా లేదా ఇంకా ఇరాన్పై దాడులు చేస్తారా అనేది క్లారిటీ లేదు. ట్రంప్ మాత్రం ఇరాన్ లొంగేవరకు దాడులు కొనసాగిస్తామని ఇప్పటికే చెప్పారు. మరోవైపు ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
Also Read: భారత చమురు కంపెనీలకి రోజుకు 2 వేల కోట్ల నష్టం
అసలేంటి ఈ ఖర్గ్ ఐలాండ్ ?
ఖర్గ్ ఐలాండ్ అనేది పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఈ ఐలాండ్ ఎంతో కీలకంగా పనిచేస్తోంది. ఇరాన్ ఎగుమతి చేసే చమురులో దాదాపు 90 శాతం ఇక్కడి నుంచే వస్తుంది. 1986 నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరుగుతూ వచ్చాయి. దీంతో ఇరాన్ చమురు ఎగుమతికి ఈ ఐలాండ్ కీలకంగా మారింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ఇప్పటిదాకా దాదాపు 13.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ ద్వీపం నుంచి ఎగుమతి చేసింది.
ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ఐలాండ్ను ఇప్పటిదాకా టచ్ చేయలేదు. కానీ తాజాగా ఆ ద్వీపంపై దాడులు చేయడం ప్రాధాన్య సంతరించుకుంది. దీంతో యుద్ధం పరిస్థితులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిపోయాయి.
Follow Us