/rtv/media/media_files/2025/02/06/uLtiIKmiHXgMldYoz0vO.jpg)
running train accident Photograph: (running train accident)
మహబాబాబాద్ జిల్లా కేసముద్రం సమీపంలో శాతవాహన ఎక్స్ప్రెస్ నుంచి జారిపడ్డ యువకుడి తీవ్రగాయాలు అయ్యాయి. పరకాలకు చెందిన అరవింద్ అనే విద్యార్థి శాతవాహన ఎక్స్ ప్రెస్లో ప్రయాణిస్తున్నాడు. ఫోన్ జారిపడి కింద పడటంతో వెంటనే అరవింద్ కూడా మొబైల్లో కోసం కిందికి దూకాడు. దీంతో అరవింద్కు తీవ్రగాయాలైయ్యాయి.
Also read : Nalgonda: మీరు సూపర్ సార్.. ఉదయం 5 గంటలకే.. టెన్త్ స్టూడెంట్ ఇంటికెళ్లి యాదాద్రి కలెక్టర్ ఏం చేశాడంటే!?
ఫోన్ కింద పడిపోవడంతో ఫోన్ కోసం కిందికి దూకిన వ్యక్తి..
— Telangana Awaaz (@telanganaawaaz) February 6, 2025
మహబాబాబాద్ జిల్లా, కేసముద్రం సమీపంలో శాతవాహన ఎక్స్ప్రెస్ లో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి పరకాలకు చెందిన అరవింద్ విద్యార్ది కి తీవ్రగాయాలు..
పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు..
జేబులో రైల్వే టికెట్ లభ్యం...@cpwarangal… pic.twitter.com/0ToHfJUrKs
చుట్టుపక్కల వారు వచ్చి యువకుడిని హాస్పిటల్కు తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అరవింద్ జేబులో రైల్వే టికెట్ లభించింది. అరవింద్ ఫామ్ డీ చదువుతున్నాడు. ట్రైన్లో ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఫోన్ కింద పడింది. ఫోన్ కోసం వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందకి దూకానని అతను చెబుతున్నాడు.
Also Read: Trump Effect: ట్రంప్ ఆఫర్ ఎఫెక్ట్.. ఏకంగా 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా!