దేశవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు చేసుకునేందుకు ఊరువాడ సిద్దమయ్యాయి. ఈ వేడుకలు కొందరి జీవితాల్లో సంతోషాన్ని ఇస్తే.. మరికొందరి జీవితాల్లో విషాదాన్ని నింపుతాయి. కొత్త సంవత్సరం పూట సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. చివ్వెంల మండలం లక్ష్మీతండాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.తండాకు చెందిన ధరావత్ శేషు (39) ను కొత్త సంవత్సర వేడుకలకు పిలిచిన ప్రత్యర్థులు గొంతు కోసి హత్య చేశారు.
Also Read: Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు
కాగా భూ తగాదాలే హత్యకు కారణమని తెలుస్తుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.
Also Read: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్
కారు అదుపు తప్పడంతో..
వివరాల్లోకి వెళ్తే.. పులివెందులకు చెందిన కొందరు యువకులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి గండికోటకు వెళ్తుండగా జమ్మలమడుగు మండలం చిటిమిటి చింతల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read: Manipur: గతాన్ని మర్చిపోయి నన్ను క్షమించండి.. సీఎం వేడుకోలు!
ఇదిలా ఉండగా.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ మద్దిమడుగు గ్రామంలో వెంకటేశ్ - రమ్య దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె - ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఈ ఇద్దరి కుమారుల్లో చిన్న కుమారుడు సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ముర్రం కోటేశ్వరరావు సోదరితో కలిసి మట్టి తేవడానికి పోలానికి వెళ్లాడు. ఆ సమయంలోనే వీరిద్దరూ ముర్రం కోటేశ్వరరావు కంట పడ్డారు. దీంతో వెంటనే కోటేశ్వరరావు గొడ్డలితో ఆ బాలుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆ బాలుడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి!