భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం.. | Bhadrachalam Ramayya Kalyanam | RTV
భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం.. | Bhadrachalam Ramayya Kalyanam is conducted by Temple Organizers and devotees celebrate this occasion with lot of worship | RTV
భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం.. | Bhadrachalam Ramayya Kalyanam is conducted by Temple Organizers and devotees celebrate this occasion with lot of worship | RTV
భద్రాద్రి రాములోరి కల్యాణంలోటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు | TTD Chairman BR Naidu visits temple and attends Bhadrachalam Sita Rama Kalyanam | RTV
శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు సమీక్ష చేసారు.
ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాములకు సిరిసిల్ల నేత కార్మికుడు సీతమ్మవారికి అరుదైన కానుక అందించనున్నాడు. సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ భద్రాద్రి సీతమ్మకు బంగారు పట్టు చీర రూపొందించాడు. చేనేత మగ్గం మీదే ఈ చీరను నేయడం గమనార్హం.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
దక్షిణ అయోధ్య భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన శ్రీరామ నవమి వేడుకలకు గురువారం సాయంత్రం అంకురార్పణ చేయాల్సి ఉంది. అర్చక బృందానికి ఆలయ అధికారులకు మధ్య నెలకొన్న వివాదంతో అంకురార్పణ క్రతువు ఆరుగంటలు ఆలస్యంగా జరిగింది.
దేశమంతా ఎన్నికల హడావుడి మొదలయింది. నోటిపికేషన్ పడిన దగ్గర నుంచి కోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ ఎఫెక్ట్ రాములోరి కల్యాణం మీద కూడా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా భద్రాచలం రాములవారి కల్యానాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి వీలు లేదని ఈసీ ఆంక్షలు విధించింది.