MI VS GT: ముంబైని చిత్తుచేసిన గుజరాత్
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబైను గుజరాత్ టీమ్ చిత్తు చేసింది. గుజరాత్ టైటాన్స్ 36 పరుగుల తేడాతో గెలిచింది.
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబైను గుజరాత్ టీమ్ చిత్తు చేసింది. గుజరాత్ టైటాన్స్ 36 పరుగుల తేడాతో గెలిచింది.
అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతోన్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(63), శుభ్మన్ గిల్(38), జోస్ బట్లర్ (39) పరుగులతో రాణించారు.
ఐపీఎల్ 2025ను ముంబై ఇండియన్స్ జట్టు ఓటమితోనే ప్రారంభించింది. దీంతో అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 2013 నుండి 2025 వరకు, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్లో తన తొలి మ్యాచ్ లో ముంబై గెలవలేదు.
తనకంటే మంచి వికెట్ కీపర్ ఇప్పటికీ లేడని మరోసారి నిరూపించాడు ధోనీ. నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్ మూడో బంతికి సూర్య కుమార్ యాదవ్ ను 0.12సెకన్లలో స్టంప్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇది చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ, అభిమానులు కూడా షాక్ అయ్యారు.
ఐపీఎల్ భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి విగ్నేష్ పుతుర్ చెన్నై జట్టును వణికించాడు. కేరళకు చెందిన పుతుర్ తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి గృహిణి.
చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ తడబడింది. 20 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
ఐపీఎల్లో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు. ఇతడిని ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2025కి ముందు MIకి బిగ్ షాక్ తగిలింది. ముంబై తొలి మ్యాచ్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్య దూరం కానున్నాడు. ఓవర్ రేట్ తప్పిదం కారణంగా పాండ్యా ఒక మ్యాచ్ సస్పెన్షన్కు గురయ్యాడు. దీంతో స్థానంలో సూర్యకుమార్ యాదవ్కు జట్టు పగ్గాలు అప్పగించింది యాజమాన్యం
భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్ సాధించారు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న 35 ఏళ్ల హర్మన్ప్రీత్ .. టీ20ల్లో 8వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్గా నిలిచారు. ఈమె కంటే ముందు స్మృతి మంధాన ఈ మైలురాయి అందుకున్నారు.