ట్రూడో నువ్ మారవా? భారత్ పై మళ్లీ అవే నిందలు..!!
దీపావళి సందర్భంగా కెనడా ప్రధాని ట్రూడో మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ పై పెద్ద నింద మోపారు. నిజ్జర్ హత్య కేసులో భారతీయ ఏజెంట్ల హస్తం ఉందనడానికి తమ వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.
దీపావళి సందర్భంగా కెనడా ప్రధాని ట్రూడో మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ పై పెద్ద నింద మోపారు. నిజ్జర్ హత్య కేసులో భారతీయ ఏజెంట్ల హస్తం ఉందనడానికి తమ వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.
అవ్వా కావాలి...బువ్వ కావాలి అన్నట్టున్నాయి కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చేసిన వ్యాఖ్యలు. భారత్ తో సన్నహిత సంబంధాలకు కట్టుబడి ఉంటామని చెబుతూనే నిజ్జర్ హత్యోదంతాన్ని మాత్రం వదిలేదని హింట్ ఇస్తున్నారు. మరోవైపు అమెరికా కూడా మావైపే ఉందంటూ ప్రకటిస్తున్నారు.
మేము చేసింది ఘోరమైన తప్పు అంటున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో. ఒకవైపు భారత్ తో ఖలిస్తానీ వివాదం, మరో వైపు ఉక్రెయిన్ తో నాజీ అంశం కెనడాను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. దీంతో ఉక్రెయిన్ కు క్షమాపణలు చెప్పారు ట్రుడో. మేము ఘోర తప్పిదం చేశామంటూ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు.
కెనడా భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశంలోని ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు కేంద్ర సర్కార్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఇంటర్య్వూలు చేయడం మానుకోవాలంటూ ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్స్ కు సలహా ఇచ్చింది కేంద్రం.
కెనడా భారత్తో సత్సంబంధాలను చెడగొట్టుకుంది. ఖలిస్థాన్ ఉగ్రవాదిని హతమార్చడం వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అలాంటి ఆరోపణలను భారత్ ఖండించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. ఇండియా పరువు తీసేందుకు కెనడా చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్ కెనడాకు సపోర్టు చేయలేదు. భారత్ విషయంలో కెనడా వైఖరి తప్పని చెప్పకనే చెప్పాయి. భారత్ పరువు తీయాలనుకున్న కెనడా తన పరువు తానే తీసుకున్నట్లయ్యింది.
ఖలీస్థానీ విషయంలో భారత్, కెనడాల మధ్య వివాదం ముదురుతోంది. దీని మీద అగ్రదేశం అమెరికా స్పందించింది. ట్రూడో ఆరోపణల మీద ఆందోళన వ్యక్తం చేసింది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య అంశంపై కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. తీవ్రవాద శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా గతేడాది జూన్ 18న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారు హర్దీప్ సింగ్ ను కెనడాలో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అయితే దీంట్లో భారత్ ప్రమేయం ఉందని కెనడా పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని ప్రకటించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది.
ఖలిస్థానీ ఉగ్రవాది , మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో భారత్కు కెనడా గట్టి ఝలక్ ఇచ్చింది. హర్దీప్ సింగ్ నిజ్జార్ కు ఉన్న సంబంధాన్ని తాము విచారిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. కాగా హర్దీప్ సింగ్ ను కెనడాలో కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జార్ పై ఇప్పటికే ఎన్ఐఏ కేసులు కూడా నమోదు చేసింది. అయితే హర్దీప్ సింగ్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
జీ-20 సదస్సుకోసం భారత వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో భారత్ కు తిరిగి వచ్చింది. ప్రధాని జస్టిన్ టూడ్ జి 20 సదస్సు అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.