/rtv/media/media_files/2025/03/15/ZFF9mb2mXSYPH7ouI0DT.jpg)
Virat Kohli ruled out a T20 international comeback at the Los Angeles Olympics in 2028
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. తాజాగా ఇన్నేవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్లో పాల్గొన్న అతడు ఫ్యాన్స్కు కిక్కిచ్చే సర్ప్రైజ్ అందించాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 128ఏళ్ల తర్వాత 2028లో లాస్ఏంజిల్స్లో జరగనున్న ఒలిపింక్స్లో క్రికెట్ను చేర్చనున్నారు. దీంతో ఒకవేళ 2028లో టీమ్ ఇండియా ఫైనల్కు చేరుకుంటే టీ20ల్లో తన రిటైర్మెంట్ను వెనక్కు తీసుకుంటానేమో అని అన్నాడు.
ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
Virat Kohli said, "I will not come back from retirement to play the Olympics. If we are playing for the Gold Medal, I will come back for one game, get a medal and go back home (smiles)". 😂❤️ pic.twitter.com/1jrPuc23z3
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2025
ఆ ఒక్క మ్యాచ్ కోసం రీఎంట్రీ
ఈ మేరకు కోహ్లీ మాట్లాడుతూ.. 2028 ఒలింపిక్స్లో భారత్ ఫైనల్కు చేరుకుంటే.. తాను ఆ ఒక్క మ్యాచ్ ఆడేందుకోసమైనా టీ20ల్లో తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటాను అని అన్నారు. ఎందుకంటే ఒలింపిక్స్లో పతకం గెలవడం కూడా ఒక అద్భుతమే కదా అని చెప్పాడు. దీంతో కోహ్లీ వ్యాఖ్యలతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
Virat Kohli is talking about the Indian Cricket Team in the Olympics.
— Virat Kohli Fan Club (@Trend_VKohli) March 15, 2025
- Virat Kohli said, "I will not come back from retirement to play the Olympics. pic.twitter.com/OM9Nlb2Kj5
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
Isa Guha introducing Virat Kohli through his achievements. 🐐🔥 pic.twitter.com/NhdBYTAh3i
— Virat Kohli Fan Club (@Trend_VKohli) March 15, 2025
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...
ఇదిలా ఉంటే త్వరలో ఐపీఎల్ 2025 సీజన్ మొదలు కాబోతుంది. దీని కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టుతో కలిశాడు. దీంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. కింగ్ ఇక్కడ ఉన్నాడని.. అందరికన్నా రెండు అడుగులు(కొన్నిసార్లు ఇంకా ఎక్కువ) ముందున్నాడని ఆ పోస్టులో రాసుకొచ్చింది. దీంతో అభిమానులు కోహ్లీని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.