/rtv/media/media_files/2025/02/20/Y2SDUUtKPV34bzncQIPQ.jpg)
panama
అమెరికా నుంచి అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపుతోన్న ట్రంప్ యంత్రాంగం.. వారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో పనామాలోని హోటల్లో భారతీయులు సహా వివిధ దేశాలకు చెందిన 300 మందిని నిర్బంధించినట్లు సమాచారం. దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వీళ్లు.. తమకు సాయం చేయాలని కోరుతూ హోటల్ గదుల్లో నుంచి వేడుకుంటున్నారు. కిటికీల వద్దకు వచ్చి అభ్యర్ధిస్తున్నారు.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని దేశాలకు చెందినవారిని నేరుగా బహిష్కరించడంలో ఇబ్బందులు ఉన్నందున.. పనామాను రవాణా కేంద్రం అమెరికా ఉపయోగిస్తోంది. ఈ క్రమంలోనే పనామాతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగానే వలసదారులను పనామాకు పంపి.. అక్కడ నుంచి వారి దేశాలకు పంపుతున్నారు. ప్రస్తుతం హోటల్లో బంధించినవారిలో భారత్, నేపాల్, ఇరాన్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, చైనా సహా పలుదేశాలకు చెందిన పౌరులు ఉన్నారు.
Also Read: Vijayawada: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు షాక్!
సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై పనామా స్పందించింది. అందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. పనామా భద్రత వ్యవహారాల మంత్రి ఫ్రాంక్ అబ్రేగో మాట్లాడుతూ.. పనామా, అమెరికా మధ్య వలస ఒప్పందంలో భాగంగా వారికి వైద్య సహాయం, ఆహారం అందజేస్తున్నామని తెలిపారు. అయితే, వారి దేశాలకు తిరిగి వెళ్లడానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తయ్యేవరకూ హోటల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి లేదని చెప్పారు.
మా దేశంలో రక్షణ ఉండదు...
ఇక, ఈ వలసదారులలో 40% కంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్లడానికి విముఖత వ్యక్తం చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు తాముండే హోటల్ గది కిటికీల వద్దకు వచ్చి సహాయం కోసం కోరుతున్నారు. ‘మా దేశంలో రక్షణ ఉండదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హోటల్లో ఉన్న 299 మంది వలసదారుల్లో 171 మంది ఐరాస శరణార్థుల సంస్థ సహకారంతో తమ తమ దేశాలకు వెళ్లడానికి అంగీకరించినట్టు పనామా మంత్రి పేర్కొన్నారు. మిగతా 128 మందిని వారి దేశాలకు కాకుండా ప్రత్యామ్నాయ గమ్యానికి చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఇటీవల లాటిన్ అమెరికాలో పర్యటించిన ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. గ్వాటమాల, పనామా దేశాలతో వలసదారుల తరలింపుపై ఒప్పందాలు చేసుకున్నారు. గతవారం 119 మంది చైనా, పాక్, అఫ్గన్ వలసదారులను పనామాకు తరలించగా.. గ్వాటమాలకు మాత్రం ఇంకా తీసుకుని వెళ్లేలేదు. దీంతో పాటు కోస్టారికాకు వలసదారులను అమెరికా తరలిస్తోంది. బుధవారం200 మంది వలసదారులతో కూడి విమానం ఆ దేశానికి చేరుకుంది. మధ్య ఆసియా, భారత్కు చెందినవీరిని వాణిజ్య విమానంలో అక్కడికి తరలించారు.
Also Read: Rekha Gupta Net Worth : సొంత కారు కూడా లేదు .. ఢిల్లీ కొత్త సీఎం ఆస్తులెంత.. అప్పులెంత?
Also Read: hyderabad: తుంగభద్ర నదిలో కొట్టుకుపోయిన మహిళా డాక్టర్