Shia Muslims: 'ఇరాన్‌కు వెళ్లిపోండి'.. షియా ముస్లింలకు పాక్ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్ హెచ్చరిక

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచంలో ఉన్న షియా ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఇలా వ్యతిరేకిస్తున్న వాళ్లపై కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Shia Muslims Firing On Asim Munir Over Leave Pakistan Comment

Shia Muslims Firing On Asim Munir Over Leave Pakistan Comment

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్( చేస్తున్న దాడులను ప్రపంచంలో ఉన్న షియా ముస్లింలు(Shia Muslims) వ్యతిరేకిస్తున్నారు. ఇలా వ్యతిరేకిస్తున్న వాళ్లపై కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశంలో కూడా ఇరాన్‌కు మద్దతిస్తున్న వాళ్లనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ను ప్రేమించే షియా ముస్లిలందరూ ఆ దేశానికి వెళ్లిపోవచ్చని హెచ్చరించారు.  

Also Read: 23వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌కు భారీ నష్టం..

Shia Muslims Firing On Asim Munir

అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలను షియా ముస్లింలు తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ తొత్తుగా అసిమ్ మునీర్ మారానని.. పాక్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పాక్ సెంట్రల్ ఉపాధ్యక్షుడు అల్లామ సయ్యద్ విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరం చేస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పాకిస్థాన్‌ను విడిచి వెళ్లాల్సింది తాము కాదన్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తున్న మునీర్ దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: యుద్ధం ఆపేస్తున్నా.. ట్రంప్ సంచలన ప్రకటన

ఇదిలాఉండగా అమెరికా, ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడులు చేయడంతో పాక్‌లో ఉన్న షియా ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చడంపై మండిపడుతున్నారు. మార్చి మొదటివారంలో కరాచీలో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే పాక్‌లో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయంపై కూడా దాడులు చేశారు. అయితే తాజాగా షియా ముస్లింలను ఉద్దేశించి అసిమ్ మునీర్ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Advertisment
తాజా కథనాలు