/rtv/media/media_files/2024/11/25/pQZkA9XUgqYsBCvfUNaD.jpg)
Chicken: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిషోర్ను గత నెలలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కిషోర్ను హైదరాబాద్లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అయితే ఈ అరెస్ట్కు సంబంధించిన ఓ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిందితుడు తురకా కిషోర్ను చికెన్ పట్టించినట్లు సమాచారం. కిషోర్ చిన్న క్లూతో పోలీసులకు దొరికినట్లు సమాచారం. గతేడాది ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మాచర్లలో పిన్నెల్లి సోదరులు, వారి అనుచరులు తురకా కిషోర్, మన్నెయ్య లాంటి వారంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తురకా కిషోర్పై పాత కేసులతో పాటూ పోలింగ్ రోజున అల్లర్లు, దాడుల ఘటనల భయంతో వీరందరూ ఫోన్ నెంబర్లను మార్చేశారు.
Also Read: Trump: ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ ను మేం దెబ్బతీయడమా?
చికెన్ కొనుగోలు...
వీరు ఆరు నెలల పాటూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ ఆరు నెలల కాలంలో తురకా కిషోర్ ఆచూకీ దొరకలేదు. అయితే పాత ఫోన్నంబరుతో మాత్రం ఫోన్పే వంటి యాప్స్ వాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఒకే మాంసం షాపునకు వెళ్లి తరచూ అదే నంబరుతో చికెన్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు.
అలా హైదరాబాద్లోని మల్కాజిగిరి జైపురి కాలనీలో గత నెలలో తురకా కిషోర్ దొరికిపోయారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిషోర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను గత నెలలో హైదరాబాద్ మల్కాజిగిరిలోని జయపురికాలనీలో విజయపురి సౌత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కిషోర్తో పాటుగా ఆయన సోదరుడు శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని మాచర్లకు తీసుకెళ్లారు. కిషోర్పై మూడు హత్యాయత్నాలతోపాటు మరో ఏడు ఇతర కేసులు ఉన్నాయి. మాచర్ల వచ్చిన టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలపై దాడి చేసిన కేసులో తురకా కిషోర్ నిందితుడిగా ఉన్నారు. అలాగే 2022 డిసెంబరు 16న మాచర్లలో టీడీపీ కార్యాలయాన్ని దహనం చేసిన కేసులో కూడా ఆయన నిందితుడు. పాల్వాయిగేటు పోలింగ్ బూత్లో టీడీపీ ఏజెంటు నంబూరు శేషగిరిరావుపై దాడిలో కూడా కిషోర్ నిందితుడే. అలాగే పోలింగ్ మరుసటి రోజు సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.