TS Congress Politics: హుటాహుటిన ఢిల్లీకి పొంగులేటి.. ఆ 15 సీట్ల కోసం పట్టు?
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లారు. తాను ప్రతిపాదించిన వారికి మొత్తం 15 టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ ను ఆయన కోరనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లారు. తాను ప్రతిపాదించిన వారికి మొత్తం 15 టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ ను ఆయన కోరనున్నారు.
తెలంగాణలో బిల్లా, రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారన్నారు రేవంత్రెడ్డి. కేసీఆర్కు ముఖం చెల్లక బిల్లా రంగాలు తిరుగుతున్నారని.. కాంగ్రెస్ ఏం చేసిందో బిల్లా రంగాలు కేసీఆర్ను అడిగితే చెబుతారన్నారు. మరుగుజ్జులు ఎవరో... ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో తేలుతుందన్నారు రేవంత్రెడ్డి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి(Kasireddy Narayana Reddy), ఆయన అనుచరుడు నాగర్కర్నూల్ జెడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్ సహా పలువురు ముఖ్యనేతలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
మోదీ, కేసీఆర్ ది ఫెవికాల్ బంధం అని ఆరోపించారు టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే... అవిభక్త కవలలన్నారు. బీఆరెస్, బీజేపీ బంధాన్ని నిన్న నిజామాబాద్ సాక్షిగా మోదీ బయటపెట్టారని చెప్పారు. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో రెండు పార్టీలను దుయ్యబట్టారు.
తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు, ఢిల్లీలో దోస్తీ – గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోదీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అతినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, అది ఎన్నికల కమీషన్ కిందకు వస్తుందని దాఖలైన పిటీషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో దీనిపై రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ రేవంత్ రెడ్డి వేసిన పిటీషన్ను కొట్టివేసింది.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ఆయన కోరారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు రేవంత్.
కాలేజీ విద్యార్థులకు ఫ్రీగా ఇంటర్నెట్ అందించాలన్న హామీ ఇవ్వాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కేవలం రూ.5/రూ.10 కి తగ్గిస్తామని మరో హామీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.
తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. నేతల మధ్య విమర్శల పర్వం మొదలైంది. మీ పాలన అదీ అంటే.. మీ పాలన ఇదీ అంటూ పరస్పర పొలిటికల్ యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య ట్విట్స్ వార్ గట్టిగా నడుస్తోంది.