TDP-Janasena-BJP: పదేళ్ల తరువాత ఒకే వేదిక పై!
పదేళ్ల తరువాత ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యా
పదేళ్ల తరువాత ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యా
కేసీఆర్కు షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్కు పంపారు. ఆయన బీజేపీలో చేరనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రచురితమైన ఎన్నికల హామీ వివరాలను చూసిన ప్రతిపక్షాలు భాజపాపై విరుచుకుపడుతున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. లిక్కర్ కేసుతో కవితకు సంబంధం ఉందో లేదో ఇప్పటికైన బయటపెట్టాలన్నారు. నేరం చేయకపోతే ఆమెకు భయమేందుకని, తప్పు చేస్తే శిక్ష తప్పదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల అవనుంది. మధ్యాహ్సం 3 గంటలకు సీఈసీ షెడ్యూల్ను విడుదల చేయనుంది. లోక్సభతో పాటూ 5 రాష్ట్రాలకు ఎన్నికలు ఉండనున్నాయి. షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది.
కవిత అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. CBI, ED వంటి సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందంటూ గతంలో చంద్రబాబు పెట్టిన ఓ ట్వీట్ ను రీ పోస్ట్ చేశారు. ఇంతకుమించి తాను చెప్పడానికి ఇంకేం లేదన్నారు. ఈ పోస్టులు వైరల్ అవుతుండగా భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి.
అవినీతి, అసమర్థుల పాలనలో కొట్టుమిట్టాడుతున్న కేరళ రాష్ట్రంలో ఈసారి కమలం వికసిస్తోందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు విచ్ఛిన్నమైతేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.
సుప్రీంకోర్టు మొట్టికాయల తర్వాత రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అసలు ఈ బాండ్స్ ఏమిటి? అభ్యంతరాలు ఎందుకు వచ్చాయి? పూర్తి వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
బీజేపీ గవర్నమెంట్ తమ పార్టీ దగ్గర డబ్బులు లేకుండా చేసి, ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఎన్డీయే స్తంభింపజేసిందని, అందంతా ప్రజలు విరాళంగా ఇచ్చిన సొమ్మేనని ఆందోళన వ్యక్తం చేశారు.