/rtv/media/media_files/2026/03/12/telegram-2026-03-12-07-22-59.jpg)
డిజిటల్ పైరసీని అరికట్టే దిశగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్లో సాగుతున్న పైరసీ కంటెంట్ దందాపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. సుమారు 3,142 ఛానళ్లను తక్షణమే తొలగించాలని టెలిగ్రామ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.
మూడు గంటల డెడ్ లైన్
పైరసీ కంటెంట్ను హోస్ట్ చేస్తున్నట్లు గుర్తించిన 3,142 ఛానళ్లను కేవలం మూడు గంటల వ్యవధిలో తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నోటీసు అందిన వెంటనే ఆయా ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఐటీ చట్టం ప్రకారం ప్లాట్ఫారమ్ అనుభవించే రక్షణలు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
India’s Ministry of Information & Broadcasting (MIB) has issued a notice to Telegram under Information Technology Act, 2000 to remove pirated content from its platform
— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 11, 2026
The action follows complaints received from OTT platforms including JioCinema, Amazon Prime Video and others,…
2. దిగ్గజ OTT సంస్థల ఫిర్యాదుతో రంగంలోకి..
జియో సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ ఓటీటీ సంస్థల ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. భారీ బడ్జెట్ సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలైన కొన్ని గంటల్లోనే టెలిగ్రామ్ ఛానళ్లలో ప్రత్యక్షమవుతుండటంతో తమకు భారీ నష్టం వాటిల్లుతోందని ఈ సంస్థలు కేంద్రానికి విన్నవించాయి.
3. ఐటీ చట్టం-2000 కింద కఠిన చర్యలు
కేంద్రం ఈ నోటీసును ఐటీ చట్టం 2000, 2021 నాటి డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ ప్రకారం జారీ చేసింది. అక్రమంగా కాపీరైట్ కంటెంట్ను పంచుకోవడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. దాదాపు 1,166 టైటిళ్లకు సంబంధించిన లింకులు ఈ ఛానళ్లలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం పంపిన 120 పేజీల అనుబంధ నివేదికలో ప్రతి ఛానల్ పేరు, URL, అందులో ఉన్న పైరసీ లింకుల వివరాలను పొందుపరిచారు. కొన్ని ఛానళ్లలో ఏకంగా 2,000 పైగా పైరసీ లింకులు ఉన్నట్లు సమాచారం. ఈ స్థాయిలో వ్యవస్థీకృత పైరసీ జరుగుతుండటంపై మంత్రిత్వ శాఖ విస్మయం వ్యక్తం చేసింది.
కేవలం ఛానళ్ల తొలగింపు మాత్రమే కాకుండా, పైరసీని ప్రోత్సహించే వారిపై కూడా నిఘా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ వేదికలపై కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించే ప్లాట్ఫారమ్లు ఇకపై కఠిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ చర్యతో కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చింది.
Follow Us