/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న దాడుల నేపథ్యంలో బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాయల్ నేవీకి చెందిన శక్తివంతమైన అణు సామర్థ్యం గల జలాంతర్గామి 'హెచ్ఎంఎస్ అన్సన్' అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. ఇరాన్, పాశ్చాత్య దేశాల మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో ఈ మోహరింపు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రిటీష్ రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, ఈ జలాంతర్గామి ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం నుండి ఈ నెల 6న బయలుదేరింది. సుమారు 5,500 మైళ్ల ప్రయాణం తర్వాత ఇది ఉత్తర అరేబియా సముద్రంలోని వ్యూహాత్మక ప్రాంతానికి చేరుకుంది.
JUST IN — 🇬🇧⁰Royal Navy nuclear sub deploys to Arabian Sea — poised to strike Iran if conflict explodes!⁰~1,000 mi from Tehran, Tomahawk-loaded, on “Alert” status with ready strike options. Sources: Response to Iran’s threats on shipping/Gulf, recent barrages, and UK… pic.twitter.com/O1J4UBvkPP
— U R B A N S E C R E T S 🤫 (@stiwari1510) March 22, 2026
హెచ్ఎంఎస్ అన్సన్ అత్యాధునిక టొమాహాక్ బ్లాక్ IV క్రూయిజ్ మిసైళ్లతో అమర్చబడి ఉంది. ఇవి దాదాపు 1,600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలవు. ఇది సముద్ర గర్భంలో ఉంటూనే నిరంతరం లండన్లోని ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతుంది. ఏదైనా దాడి చేయాల్సి వస్తే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేరుగా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది.
మోహరింపుకు కారణాలు
హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తుండగా.. అమెరికా తన మిత్రదేశాల మద్దతు కోరింది. బ్రిటన్ మొదట కొంత సంకోచించినప్పటికీ, తమ ప్రయోజనాలపై దాడులు జరగడంతో రంగంలోకి దిగింది. అమెరికా దళాలు బ్రిటీష్ సైనిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి కూడా ప్రధాని స్టార్మర్ అనుమతించారు.
ఇరాన్ హెచ్చరిక
బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. బ్రిటన్ తమ భూభాగాన్ని అమెరికా దాడులకు వేదికగా మలిస్తే, తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే హిందూ మహాసముద్రంలోని డియెగో గార్సియా అనే బ్రిటీష్-అమెరికా ఉమ్మడి స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులకు ప్రయత్నించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అరేబియా సముద్రంలో హెచ్ఎంఎస్ అన్సన్ ఉనికి కేవలం రక్షణ కోసమే కాకుండా, అవసరమైతే ఇరాన్ భూభాగంలోని లక్ష్యాలపై దాడులు చేసే సామర్థ్యాన్ని బ్రిటన్కు కల్పిస్తుంది. ఈ పరిణామం అరేబియా సముద్ర తీర దేశాలలో ఆందోళన కలిగిస్తోంది.
Follow Us