/rtv/media/media_files/2026/03/22/fotojet-5-2026-03-22-21-35-42.jpg)
Get out of Pakistan.. Army Chief warns
Pakistan Army Chief Asim Munir : అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ నేపథ్యంలో ఇరాన్కు మద్దతు ఇస్తున్న షియా ముస్లింలపై పాక్ ఆర్మీచీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఖమేనికి మద్దతిచ్చేవాళ్లు ఇరాన్ వెళ్లిపోండి.పాకిస్తాన్లో షియాలు నివసించడానికి అనర్హులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రావల్పిండిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మునీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో - పాకిస్తాన్ షియా వర్గాల్లో మునీర్ అగ్గిరాజేసినట్లయింది.- ఈ దేశం సృష్టికి మూలం తామేనని షియాలు వాదిస్తున్నారు. ఖమేని హత్య తర్వాత పాకిస్తాన్ షియాలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే.- కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, గిల్గిట్లో ఆందోళనకు దిగారు. షియా నిరసనలు- హింసాత్మక ఘటనలకు దారితీశాయి.- సుమారు 30మంది మృతి చెందగా వందలాదిమందికి గాయపడ్డారు.
కాగా అటు ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడితో పాటు షియాలను అణచివేసేలా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరుతో- ఇప్పటికీ పాక్లో షియాల ఆగ్రహజ్వాల కొనసాగుతోంది.షియాల ఆందోళనలను అరికట్టేలా పాక్ ఆర్మీ చర్యలు చేపట్టింది.ఈ సందర్భంగా- పాక్ ఆర్మీ చీఫ్ మునీర్పై షియా నాయకుడు షేక్ జావెద్ ఫైర్ అయ్యారు.- షియాలు మౌనం పాటిస్తున్నారని అనుకోవద్దు. షేక్ జావెద్ వార్నింగ్ ఇచ్చారు. 8లక్షమంది ఉన్న దేశ సైన్యంలో 3లక్షలమంది షియాలే అని షేక్ జావెద్ వార్నింగ్ ఇచ్చారు.షియాలకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.- లేకుంటే పాకిస్తాన్ అట్టుడుకుతుంది అంటూ షేక్ జావెద్ హెచ్చరించారు.
Follow Us