Accident: లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు మృతి..!
ఖమ్మం జిల్లా గంగారంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఖమ్మం జిల్లా గంగారంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్లపెంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రాధమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న తోలెమ్ వరుణ్(7) అనే బాలుడు సీతారామ కెనాల్లో పడి మృతి చెందాడు. ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం కారణంగానే వరుణ్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు.
ఖమ్మంలో టీచర్ శిరీషకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల విద్యార్థుల హెయిర్ కట్ సరిగా లేదంటూ ఉపాధ్యాయురాలు శిరీష కత్తెరతో జుట్టు కత్తిరించారు. దీంతో ఉన్నతాధికారులు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఖమ్మం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టు ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ అయింది. అన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల సామర్థ్యం, క్రస్ట్ గేట్ల పనితీరుపై నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దిగువ ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.
భద్రాద్రి జిల్లా నారాయణపురం కట్ట మైసమ్మ గుడి వద్ద వరదలో చిక్కుకున్న 30 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో తరలిస్తున్నారు. పరిస్థితిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దగ్గరుండి సమీక్షిస్తున్నారు.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో రైతు కూలీలు వరదల్లో చిక్కుకున్నారు. ఎగువ కురిసిన వర్షాలకు పెదవాగు ప్రాజెక్ట్కు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. సమాచారం లేకపోవడంతో రైతు కూలీలు, పశువుల కాపరులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు.
TS: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జమేదారు బంజర గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు అన్నా, తమ్ముడు మృతి చెందారు. అపస్మారకస్థితిలో ఉన్న మరో మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఖమ్మం జిల్లా ఇందిరానగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పింఛన్ డబ్బులు ఇవ్వడంలేదని అమ్మమ్మ రాంబాయిను దారుణంగా హత్య చేశాడు మనవడు ఉదయ్. రాంబాయి శరీరంపై గాయాలు కనిపించడంతో ఉదయ్ ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు.