YS Sharmila : షర్మిల దూకుడు.. జిల్లాల పర్యటన షురూ.. తేదీలు ఖరారు!
ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ షర్మిల జనవరి 23 నుంచి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టి ఇడుపులపాయ వరకు ఆమె పర్యటన చేస్తారని సమాచారం.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ షర్మిల జనవరి 23 నుంచి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టి ఇడుపులపాయ వరకు ఆమె పర్యటన చేస్తారని సమాచారం.
హైదరాబాద్ గండిపేట గోల్కొండ రిసార్ట్స్లో వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం జగన్ సందడి చేశారు. షర్మిల-విజయమ్మతో కలిసి దిగిన ఫొటోలు వైరల్గా మారాయి.
తిరుపతిలో కోటి హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొన్నారు నటుడు మంచు మోహన్ బాబు. పారాయణ మహాయజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ..సీఎం జగన్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. కులాలు విడగొట్టడం బుద్ధి లేని వారి పనేనని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యనించారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికేతరుడు కావడంతోనే హిందూపురం అభివృద్ధి జరగలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అందుకే స్థానికరాలైనా మహిళా అభ్యర్థిని పోటీలో దింపుతున్నట్లు వెల్లడించారు. హిందూపురంలో గ్రూపు తగాదాల వల్లే వైసీపీ అభ్యర్థులు వరుసగా ఓడిపోతున్నారని కామెంట్స్ చేశారు.
కాపు, బలిజ వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని మాజీ టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి నేత ఓ.వి.రమణ మండిపడ్డారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో బలిజలను రాజకీయంగా పాతాళానికి తొక్కారన్నారు. కాపు, బలిజలపై సీఎం జగన్ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ గూటికి చేరుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతలు సారథిని కలిసి మాట్లాడారు.
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని, కనీసం పొటాటోకి టామాటా తేడా తెలియని వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు. అతి త్వరలోనే టీడీపీ ప్రభుత్వం వస్తుందని బాబూ తిరువూరులో జరిగిన బహిరంగ సభలో తెలిపారు.