హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుబేదారి చౌరస్తాలో నిన్న రాత్రి అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లారీ కిందకి దూసుకుపోయింది. కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ ప్రమాదంలో లారీ కరెంట్ పోల్ను ఢీకొని ఆగిపోయింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజ్
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2025
హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం
హన్మకొండ సుబేదారి చౌరస్తాలో నిన్న రాత్రి అతివేగంగా ప్రయాణిస్తు అదుపుతప్పి లారీ కిందకి దూసుకుపోయిన కారు
కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలించిన స్థానికులు pic.twitter.com/TJds0gCoWA