Viral News: వారికి ఓటేయండి.. వైరల్ గా మారిన వెడ్డింగ్ కార్డ్..!

'నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి.. ప్రధాని మోదీకి మీరు వేసే ఓటు' అంటూ ముద్రించిన నందికంటి వారి పెళ్లి కార్డు వైరల్ గా మారింది. సంగారెడ్డి జిల్లాలో సాయికుమార్, మహిమ రాణి పెళ్లి ఏప్రిల్ 4న నిర్ణయించారు. అయితే, పెళ్లి కార్డుపై వినూత్నంగా మోదీకి ఓటు వేయండని ప్రింట్ చేయించారు.

New Update
Viral News: వారికి ఓటేయండి.. వైరల్ గా మారిన వెడ్డింగ్ కార్డ్..!

Viral News: దేశంలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సెగ శుభకార్యాలకు సైతం తాకుతోంది. శుభకార్యాలకు నలుగురు కలిసి రావడం.. ముచ్చట్లు పెట్టుకోవడం ఆతిథ్యం స్వీకరించడం వంటివి మామూలే. అంతేకాదు ఇలాంటి కార్యక్రమాల్లో పలు పార్టీల నేతలు కలుసుకోవడం కూడా సహజమే. అయితే, ఈ మధ్య కాలంలో పెళ్లి శుభలేఖల్లో తమ అభిమాన నటులు లేదా రాజకీయ నేతలు ఫొటోలు ముద్రించడం కామన్ గా మారింది. ముఖ్యంగా ఫ్లెక్సీలు వేయించడం ముఖ్యంగా  మాకు గిఫ్ట్స్ ఇవ్వకపోయినా పర్లేదుకానీ.. మీ ఓటు మాత్రం ఫలానా నేతకే వేయండంటూ అభిమానులు ప్రచారం చేసేస్తున్నారు.

Also Read: మొసళ్లను కూడా వేటాడు గలదు..ఈ టైగర్ ఫిష్!

తాజాగా, సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీకి ఓటేయండి అదే మాకు గిఫ్ట్ అంటూ ఓ ఇంటి వారు పెళ్లి కార్డుపై ముద్రించడం వైరల్ గా మారింది. ఆరుట్ల గ్రామంకు చెందిన సాయికుమార్, మహిమ రాణికి ఏప్రిల్ 4న వివాహం నిశ్చయించారు. అయితే, వారి పెళ్లి కార్డును వినూత్నంగా ప్రింట్ చేయించారు. 'నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి.. ప్రధాని మోదీకి మీరు వేసే ఓటు' అంటూ ముద్రించారు. ప్రస్తుతం ఈ పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు వీరి అభిమానం తగిలేయ్య అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు