Hyderabad: గణేష్ ఉత్సవాల్లో విషాదం.. డాన్స్ చేస్తూ అక్కడిక్కడే..! అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా మరణించాడు. లడ్డు కైవసం చేసుకున్న తన ఫ్రెండ్ ముందు సంతోషంతో డాన్స్ వేసిన శ్యామ్ కాసేపటికి గుండె పోటుతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. By Archana 16 Sep 2024 in క్రైం Short News New Update ganesh Celebrations 2024 షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ ట్విన్ సిటీలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని వీధి వీధిలో గణేషుడి విగ్రహాలతో ప్రజలు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో మణికొండ అల్కాపూరి కాలనీ లో గణేష్ ఉత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉత్సవాల్లో డాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలి అక్కడిక్కడే మృతి చెందాడు. డాన్స్ వేస్తు గుండెపోటుతో మృతి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ అల్కాపూరి టౌన్ షిఫ్ నివాసం ఉంటున్నాడు. అయితే తమ కాలనీలోని గణేష్ నిమజ్జనం సందర్భంగా శ్యామ్ మండపం వద్ద డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత గణేష్ లడ్డు వేలం పాటలో పాల్గొన్న శ్యామ్ ఆకస్మికంగా మృతి చెందాడు. వేలం పాటలో తన స్నేహితుడు లడ్డు కైవసం చేసుకోవడంతో శ్యామ్ అతని ముందు ఆనందంతో బాగా డాన్సులు వేశాడు. కాసేపటికి ఇంటికి వెళ్లిన శ్యామ్ గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. శ్యామ్ మరణంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు శోక సంద్రంలో మునిగారు. సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి