ఓలా ఎలక్ట్రిక్ తన రోడ్‌స్టర్ X, రోడ్‌స్టర్ X+ ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది.

ఓలా రోడ్‌స్టర్ X రూ. 74,999 ఎక్స్-షోరూమ్ ధరల నుండి ప్రారంభమవుతాయి.

రోడ్‌స్టర్ X+ రూ.1,04,999 ఎక్స్-షోరూమ్ ధరల ప్రారంభమవుతాయి.

రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌లో స్పోర్ట్స్, నార్మల్, ఎకో అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.

రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ బైక్‌లో అడ్వాన్స్‌డ్ రీజెన్, ఎనర్జీ ఇన్‌ సైట్స్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్స్ ఉంటాయి.

దీంతో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో పొందొచ్చు.

రోడ్‌స్టర్ X 4.5kWh బ్యాటరీ సింగిల్ ఛార్జింగ్‌పై 252 కిమీ మైలేజీ ఇస్తుంది.

రోడ్‌స్టర్ X+ 9.1kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జింగ్ పై 501కి.మీ మైలేజీ అందిస్తుంది.

ఈ రెండు బైక్‌లకు సంబంధించిన బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి.